తమిళ బ్లాక్బస్టర్ `జిగర్తండా`కి రీమేక్గా రూపొందిన చిత్రం `వాల్మీకి`. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో అధర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య భూమికలు పోషించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మితమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్కి మిక్కీ జే మేయర్ స్వరాలు అందించారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `వాల్మీకి`లో యువ కథానాయకుడు నితిన్ ఓ అతిథి పాత్రలో నటించాడు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. “`వాల్మీకి`లో ఎగ్జైటింగ్ కామియో చేసినందుకు నా `భీష్మ`కు కృతజ్ఞతలు. లవ్ యూ డార్లింగ్“ అంటూ నితిన్తో కలసి దిగిన ఫొటోను షేర్ చేశాడు వరుణ్. మరి… నితిన్ అతిథి పాత్ర `వాల్మీకి`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: