`ఆర్య`, `ఆర్య 2` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో రష్మిక పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఇందులో రష్మిక పల్లెటూరి పడుచు పాత్రలో కనిపిస్తుందట. అంతేకాదు… ఆమె వేషధారణ, భాష… ఇలా ప్రతీ అంశం కొత్తగా ఉంటుందని సమాచారం. సుకుమార్ గత చిత్రం `రంగస్థలం`లో సమంత రామలక్ష్మిగా ఎలాగైతే సరికొత్తగా కనిపించిందో… అలా ఇప్పుడు రష్మిక దర్శనమివ్వబోతుందన్నమాట. మరి… సామ్ తరహాలో రష్మిక కూడా మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: