ఇళయరాజా… నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న దిగ్గజ స్వరకర్త. అలాంటి మ్యూజిక్ మేస్ట్రో వారసుడిగా స్వరంగేట్రం చేసిన యువన్ శంకర్ రాజా కూడా రెండు దశాబ్దాలకు పైగా తన బాణీలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాడు. అయితే, ఈ తండ్రీకొడుకులు ఇప్పటివరకు ఒకే సినిమా కోసం బాణీలు కట్టిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా శీను రామస్వామి దర్శకత్వంలో ‘ మామణిదన్’ అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలసి స్వరకల్పన చేస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలియజేసాడు యువన్. “తొలిసారి మా నాన్నగారితో కలసి ‘మామణిదన్’ కోసం పనిచేస్తున్నా. ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను తప్పకుండా అలరిస్తాయి” అంటూ పాటను స్వరపరస్తున్న ఇళయరాజా పిక్ను పోస్ట్ చేసాడు యువన్. అంతేకాదు… ఈ మూవీ కోసం ఇళయరాజా పెద్ద కుమారుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా కూడా తన వంతు సాయం చేస్తున్నాడు. మరి… తండ్రీకొడుకులు కలసి తొలిసారి పనిచేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లోని పాటలు శ్రోతలను ఏ మేర అలరిస్తాయో చూడాలి.
కాగా… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: