`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా… భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవల థాయ్లాండ్లో తొలి షెడ్యూల్ను పూర్తి చేసిన చిత్ర బృందం… గురువారం నుంచి (సెప్టెంబర్ 5) రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ను ప్రారంభించింది. బాలకృష్ణ వేదపండితుల మధ్య కూర్చుని యాగం చేస్తున్న సన్నివేశంతో పాటు… ఫైట్ మాస్టర్లు అన్బు, ఆరవి నేతృత్వంలో బాలయ్య, కొంతమంది ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని కూడా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
కాగా…ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. 2019 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: