‘అర్జున్ రెడ్డి’(2017) వంటి సంచలన చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ఉత్తరాది భామ షాలిని పాండే. ఆ తరువాత ‘మహానటి’, ‘యన్టీఆర్ కథానాయకుడు’, ‘118’ వంటి చిత్రాలతోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ… ఇటీవల ‘గొరిల్లా’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని నటించిన తాజా చిత్రం ‘100% కాదల్’(‘100% లవ్’ రీమేక్) విడుదలకు సిద్ధం కాగా… ‘అగ్ని సిరగుగల్’, మల్టీలింగ్వల్ మూవీ ‘నిశ్శబ్దం’ చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సౌత్లో బిజీగా ఉన్న ఈ టాలెండెట్ బ్యూటీకి తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి ఓ భారీ డీల్ కుదిరిందని సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం… ఆ బ్యానర్లో నిర్మితమయ్యే వరుస చిత్రాలలో హీరోయిన్గా నటించే అవకాశం షాలినికి దక్కిందని బాలీవుడ్ ఖబర్. హిందీ చిత్ర పరిశ్రమలో ఈ తరహా ఒప్పందాలు షరా మామూలే. మరి… ఈ డీల్ను షాలిని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. కాగా… ఇప్పటికే ‘మేరీ నిమ్మో’ (2018)తో బాలీవుడ్లో షాలిని ఎంట్రీ ఇచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: