లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే బాలీవుడ్ మూవీ మైదాన్ 19 వ తేదీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్
మూవీ ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైదాన్ మూవీ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన భార్య గా కీర్తి సురేష్ నటిస్తున్నారని సమాచారం. 1950 వ సంవత్సరం నుండి 1963 వ సంవత్సరం వరకు భారతీయ ఫుట్ బాల్ టీమ్ కు కోచ్, మేనేజర్ గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ మన దేశం అనేక పతకాలు గెలుచుకొనేలా క్రీడా కారులను తీర్చిదిద్దారు.1952 టు 1962 వరకు 10 సంవత్సరాలు భారతీయ ఫుట్ బాల్ టీమ్ కు గోల్డెన్ ఎరా గా పరిగణిస్తారు. మైదాన్ మూవీ లో తన క్యారెక్టర్ గురించి ఇప్పుడే వెల్లడించకూడదని, ఈ మూవీ లో భాగం అయినందుకు సంతోషంగా ఉన్నానని, ప్రతీ భారతీయుడు గర్వపడే మూవీ గా రూపొందనుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని కీర్తి సురేష్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: