‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’లో వరంగల్ చాందినిగా కుర్రకారుని ఫిదా చేసిన ఈ కన్నడ కస్తూరి… ఇప్పుడిప్పుడే తెలుగు నాట వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’లో ఒక నాయికగా నటిస్తున్న నభా… తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగా హీరో సాయి తేజ్, టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్టా కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో తేజ్ సరసన నభా నటేష్ నాయికగా ఎంపిక అయ్యిందట. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఏదేమైనా… నభా ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: