సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్తో ప్రేక్షకులను అలరించిన శేష్.. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి అడివి శేష్ మరో హిట్ అందుకున్నాడు. ఆగస్టు 15న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెంకట్ రామ్జీ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ రాబడుతుంది. ఇక ఈ సినిమా చూసిన సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మరో రికార్డ్ ను ఖాతాలో వేసుకుంది. నేషనల్ వైడ్ గా ముల్టీప్లెక్స్ లలో ఆడుతున్న టాప్ టెన్ సినిమాల్లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు టాప్ టెన్ లో 4వ ప్లేస్ లో వుంది ఎవరు. దీన్ని బట్టి ఎవరు సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది కదా. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా రణరంగం సినిమా 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పీవీపీ బ్యానర్ పై ఈసినిమాకు నిర్మించగా… శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 కాగా మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్. మరి ఈ సినిమాలు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: