`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా… భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా…ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ థాయ్లాండ్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా… తాజాగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా… సెప్టెంబర్ 6తో పూర్తి కానున్న ఈ లాంగ్ షెడ్యూల్లో… కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా తెరకెక్కించనున్నట్టు భోగట్టా.
చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2019 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: