తమిళ, తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ఈరోజు ప్రారంభమయింది. బోనీకపూర్ నిర్మాతగా, బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందనున్న మైదాన్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుట్ బాల్ కోచ్ , మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా
మైదాన్ మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండియన్ నేషనల్ ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా, మేనేజర్ గా సయ్యద్ అబ్దుల్ రహీమ్ 1950 వ సంవత్సరం నుండి 1963 సంవత్సరం వరకు సేవలందించారు. 1956 వ సంవత్సరం మెల్ బోర్న్ ఒలింపిక్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో ఇండియన్ టీమ్ ను సెమీ ఫైనల్ వరకు తీసుకు వెళ్ళిన ఘనత ఆయనదే. 1962 వ సంవత్సరం జకార్తా ఏషియన్ గేమ్స్ లో సౌత్ కొరియా తో పోటీపడి ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకొనడం ఆయన ఆఖరి విజయం. అబ్దుల్ రహీమ్ హైదరాబాదీ కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: