తెలుగునాట బ్రదర్ – సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందాయి. అయితే, కవలలైన అక్క – తమ్ముడు కథలతో సినిమాలు తెరకెక్కడం అరుదనే చెప్పాలి. అలాంటి చిత్రమే… ‘అర్జున్’. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామాను టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించాడు. ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మహేష్కి కవల సోదరిగా కీర్తి రెడ్డి నటించగా… శ్రియ కథానాయికగా నటించింది. రాజా, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. సుదీర్ఘ విరామం అనంతరం సీనియర్ యాక్ట్రస్ సరిత ఈ సినిమాతో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘అర్జున్’ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది… మధుర మీనాక్షి టెంపుల్ సెట్. ఆ సెట్ను ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ “పద్మశ్రీ” తోట తరణికి… ఈ చిత్రానికి గానూ `ఉత్తమ కళా దర్శకుడు`గా `నంది` పురస్కారం వరించింది.
వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ వినసొంపైన బాణీలు అందించాడు. ముఖ్యంగా “మధుర మధురతర మీనాక్షి” పాట బాగా ప్రాచుర్యం పొందింది. బాలనటుడిగా మహేష్ నటించిన చివరి చిత్రమైన`బాలచంద్రుడు` తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని మహేష్ అన్నయ్య జి.రమేష్ బాబు నిర్మించడం విశేషం. 2004 ఆగస్టు 18న విడుదలైన `అర్జున్`… నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.