మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే రజినీకాంత్ లుక్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. చిత్ర యూనిట్ జైపూర్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. రజినీకాంత్, నయన తార ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ దర్భార్ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ఇక దాదాపు పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మొత్తానికి రజిని యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘2.0’ సెట్స్ మీద ఉండగానే.. ‘కాలా’ అనే సినిమాను చేసి దీని తర్వాత చాలా తక్కువ వ్యవధిలో ‘పేట’ అనే చిత్రం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు నెలల వ్యవధిలో ఆయనవి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దర్బార్ త్తరువాత పేట’ తీసిన కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ రజనీతో ఇంకో చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారట. మరోవైపు రజనీ ఫేవరెట్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ సైతం రజనీతో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి చూద్దాం రజినీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..
[youtube_video videoid=cmMg1MoypTI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: