ఆది సాయికుమార్ హీరో గా ‘వినాయకుడు’.. ‘కేరింత’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ దర్శకత్వం లో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమాను తెరకెక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుందని చెప్పొచ్చు. గతంలో ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని అది కుదరలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అన్ని కార్యక్రమాలు ముగించుకొని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సాషా ఛెత్రి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినాయకుడు టాకీస్ బ్యానర్పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆదికి ఈ సినిమాఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
[youtube_video videoid=Di2RS42rXuU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: