ఇప్పటికే సాహో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎప్పుడు తాజాగా మరో రికార్డు ను సొంతం చేసుకుంది. యూరోప్ లోని ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్లో ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నెల 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది కనుక నేషనల్ వైడ్ గా ప్లాన్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఈ సినిమాను ఆగస్ట్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: