‘చిత్రలహరి’తో మెమరబుల్ హిట్ అందుకున్న మెగా హీరో సాయి తేజ్… ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతీ రోజు పండగే’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా… ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందనుందని సమాచారం. కాగా… ఈ సినిమా పూర్తయ్యేలోపు మేర్లపాక గాంధీ, డెబ్యూ డైరెక్టర్ సుబ్బుతోనూ సాయితేజ్ కొత్త ప్రాజెక్ట్స్ పట్టాలెక్కనున్నాయని సమాచారం. అంతేకాదు… మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లోనూ నటించేందుకు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఆ వివరాల్లోకి వెళితే… ‘ప్రస్థానం’ (2010) వంటి పొలిటికల్ థ్రిల్లర్ని అందించిన దర్శకుడు దేవా కట్టా… అదే తరహాలో ఓ సబ్జెక్ట్ను రెడీ చేసాడట. ఇటీవల తేజ్ని సంప్రదించి స్క్రిప్ట్ను కూడా వినిపించాడట దేవా. తేజ్కి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని టాక్. కాగా… ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలువడే అవకాశం ఉంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.