విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. తన తరం కథానాయకుల్లో ఎక్కువ సక్సెస్ రేట్ చూసిన వెంకీకి ఈ రోజు (ఆగస్టు 14) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే… సరిగ్గా 33 ఏళ్ళ క్రితం అంటే 1986లో ఇదే తేదిన వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `కలియుగ పాండవులు` విడుదలైంది. తన తండ్రి డి. రామానాయుడు నిర్మాణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. తొలి అడుగుల్లోనే అతనికి `విక్టరీ` కట్టబెట్టింది. అప్పట్నుంచి ‘F2` వరకు ఈ దగ్గుబాటి హ్యాండ్సమ్ హీరో నటనాప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా… మున్ముందు కూడా మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలతో ఈ టాలెంటెడ్ స్టార్ ఘనవిజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
[youtube_video videoid=3K3qNc2Ww-4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.