సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సాహో’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రోజుకో అప్డేట్ ఇస్తూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గాట్రైలర్ ను రిలీజ్ చేయగా.. అది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. బాహుబలి రికార్డ్స్ సైతం చెరిపేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 18వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: