లోక నాయకుడు కమల్ హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’(1996) ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే… 23 ఏళ్ళ తరువాత కమల్, శంకర్ కాంబోలో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సోమవారం చెన్నైలో ప్రారంభమైన తాజా షెడ్యూల్లో… రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్లో భాగంగా రకుల్పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా… శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసి… తమిళ సంవత్సరాది సందర్భంగా 2020 ఏప్రిల్ 14న ‘భారతీయుడు 2’ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్.
[subscribe]
[youtube_video videoid=6SJvjNd-cvs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: