ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి తన తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ జాతి రత్నాలు గా
చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసాధారణ పరిస్థితులలో చిక్కుకున్న ముగ్గురు యువకులు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ మూవీ స్టోరీ అని, నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల హిలేరియస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయని సమాచారం. తెలంగాణ రాష్ట్రం లోని సంగారెడ్డి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో తెలంగాణ యాస లో సంభాషణలు ఉంటాయి. లో బడ్జెట్ లో రూపొందుతున్న జాతి రత్నాలు మూవీ లో తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పిట్టగోడ మూవీ కి దర్శకత్వం వహించిన అనుదీప్ కు జాతిరత్నాలు రెండవ మూవీ.
[subscribe]
[youtube_video videoid=D1oaL_m5BVU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: