నరేంద్ర అనే కొత్త డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచలో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో కార్తికేయ సంతానం నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. దీనితో పాటు కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. అంతేకాదు బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ఓ సినిమా చేస్తుంది. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ను కొట్టేసింది కీర్తి సురేష్.
మొత్తానికి కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, హిందీ ఇలా భాషా భేదం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరి ఈ సినిమాల్లో ఆ సినిమా హిట్ అవుతుంది..?ఏ సినిమా ఫట్ అవుతుందో చూద్దాం..?
[subscribe]
[youtube_video videoid=G9nrHltl0ng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: