అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భం గా మహేష్ ఇంట్రడక్షన్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 13 సంవత్సరాల తరువాత.. విజయశాంతిగారికి ఇది మేకప్ సమయం.. ఈ 13 ఏళ్లలో ఆమె క్రమశిక్షణ, నటన పట్ల ఆమె వైఖరి మరియు ఆమె చైతన్యం.. ఆమెలో ఏదీ మారలేదు.. షూటింగ్ కి స్వాగతం విజయశాంతిగారు’ అని పోస్ట్ చేశారు.
After 13 years.. It’s make up time for Vijayashanthi garu.. Nothing has ever changed in all these 13 years. Same discipline, same attitude and same dynamism. Welcome on-board @vijayashanthi_m garu 😊 #SarileruNeekevvaru pic.twitter.com/xM69EgjP9c
— Anil Ravipudi (@AnilRavipudi) August 12, 2019
కాగా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా… దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ ఏడాది ఎఫ్ 2 తో అనిల్, మహర్షి తో మహేష్ బాబు హిట్ అందుకున్నారు… ఈ సినిమాతో వీరిద్దరు మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[youtube_video videoid=YaCGtGfoI1Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: