`ఎఫ్ 2` వంటి ఘనవిజయం తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వస్తున్న చిత్రం `వాల్మీకి`. తమిళనాట ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కి రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైనట్టు సమాచారం. ఇందులో భాగంగానే… ఈ చిత్రం నైజాం హక్కులు రూ.7.30 కోట్లకు పలికాయని ట్రేడ్ టాక్. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ని కొనుగోలు చేసి లాభాలు చూసిన బయ్యర్ శ్రీనివాసరావు… ఇప్పుడు ‘వాల్మీకి’ నైజాం హక్కుల్ని కూడా సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే… దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కాగా… మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్న `వాల్మీకి`… సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=hGQTUrvmRHs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: