వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా అన్నపూర్ణా స్టూడియోలో వేసిన కోటి 20 లక్షల రూపాయిల సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక షెడ్యూల్ తర్వాత డిస్కోరాజా టీం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 26 తో పూర్తి చేసి.. ఆగష్ట్ మెదటివారం నుండి ఢిల్లి లో షూటింగ్ జరుపుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ ఇప్పటికే షూట్ లో కూడా పాల్గొన్నారు. మూడో హీరోయిన్ తాన్యా హోప్ కూడా నెక్ట్స్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈసినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈసినిమాతో అయినా మంచి సక్సెస్ అందుతుందేమో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=n4ape_H2fkI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: