నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘లెజెండ్’ బ్లాక్బస్టర్ కాగా… రెండో చిత్రం ‘డిక్టేటర్’ డీసెంట్ హిట్ అనిపించుకుంది. కాగా… స్వల్ప విరామం తరువాత ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `జై సింహా` తరువాత బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కలయికలో ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో… పోలీస్ ఆఫీసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం శ్రియా శరన్, పాయల్ రాజ్పుత్ పేర్లు పరిశీలనలో ఉండగా… సెకండ్ లీడ్ కోసం సోనాల్ చౌహాన్ను ఎంపిక చేసిందట చిత్ర బృందం. త్వరలోనే కథానాయికల విషయంపై మరింత క్లారిటీ వస్తుంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనున్న ఈ సినిమా… 2020 సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=LZD-sQyqmMU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: