ఇటీవల ‘వినరా సోదర వీర కుమారా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి ‘మథనం’ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస సాయి సరసన భావన రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతం అందించిన రాన్ ఎహాన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. కాశీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అషోక్ ప్రసాద్, దివ్వ ప్రసాద్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. కో ప్రొడ్యూసర్ – మదన్ తీగల, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు.
[subscribe]
[youtube_video videoid=LBG81GcVBuA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: