ఈ వేసవిలో `మహర్షి`గా మురిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇటీవల తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే… ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్పై ఉండగానే… తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మహేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది ‘గీతగోవిందం’తో సంచలనం విజయం అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్… మహేష్ కోసం ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసాడని టాక్. కథ నచ్చడంతో మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్కి వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. అంతేకాదు… ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సెట్స్ పైకి వెళ్ళే మహేష్ చిత్రమిదే అవుతుందని సమాచారం. అలాగే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మిస్తాడని తెలుస్తోంది. మరి… క్రేజీ కాంబినేషన్స్లో వస్తున్న ఈ సినిమా… ఎటువంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=b2Yz4RKlops]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: