‘గూఢచారి’ లాంటి యాక్షన్ డ్రామాతో హిట్ కొట్టిన అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ రిలీజ్ కార్యక్రమంలో అడివి శేష్ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్షణం సినిమా వరకు నన్ను అందరు విలన్ గానే చూసేవారు.. హీరో క్యారెక్టర్లు ఇవ్వడానికి బయపడేవారు..నన్ను నమ్మిన మొదటి వ్యక్తి పీవీపీ గారు.. ఎవరూ నమ్మని టైమ్ లో ఆయన నన్న నమ్మారు.. అంతేకాకుండా మహేష్, సామ్ నన్ను నమ్మి మరోసారి టీజర్ లాంచ్ చేశారు.. అది నాకు ఎమోషనల్ మూమెంట్.. ఈ సినిమాకు మంచి వైబ్ వచ్చింది.. అందుకే మరోసారి గూఢచారి టీజర్ ను సామ్ తో రిలీజ్ చేయించా.. తనకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.. అది లక్ రూపంలో వస్తుందని తెలిపాడు. గూఢచారి కంటే క్షణం కు దగ్గరగా ఉంటుంది ఈ సినిమా అని తెలిపాడు.
ఇప్పుడు ఎవరు టీజర్ ను కూడా అడివి శేష్ సమంతతో రిలీజ్ చేయించాడు. మరి ఈసినిమాకు కూడా సమంత లక్ కలిసొచ్చి.. క్షణం, గూఢచారి సినిమాలు హిట్టయినట్టు.. మంచి హిట్ కొడుతుందేమో చూద్దాం. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే.. అందరూ సమంతతోనే రిలీజ్ చేయిస్తారేమో.. చూద్దాం.. ఏం జరుగుతుందో..
కాగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పీవీపీ బ్యానర్ పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=EmaVLDlzu5M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: