ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్… ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టీలింగ్వల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్సన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి… హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో అనుష్క బదిర యువతిగా (చెవిటి, మూగ) దర్శనమివ్వనుందట. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను అనుష్క తొలి చిత్రం ‘సూపర్’ (2005) విడుదల తేది అయిన జూలై 21న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కాగా… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిమ్ కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘నిశ్శబ్దం’ ఈ సంవత్సారంతంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.