గత ఏడాది సంచలనం ‘ఆర్ ఎక్స్ 100’తో సంగీత దర్శకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్ భరద్వాజ్. ముఖ్యంగా `పిల్లా రా` పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తరువాత థ్రిల్లర్ ఫిలిమ్ ‘7’లో మరోసారి తన బాణీలతో అలరించాడు ఛైతన్. ‘ఆర్ ఎక్స్ 100’, `7`కి మధ్య దాదాపు 11 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ యువ సంగీత సంచలనం… ఇప్పుడు వారం రోజుల గ్యాప్లోనే రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. ఆ సినిమాలే `గుణ 369`, `మన్మథుడు 2`.
`ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘గుణ 369’కి స్వరాలు సమకూర్చాడు చైతన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 2న తెరపైకి రానుంది. ఇక ఈ చిత్రం విడుదలైన వారం రోజులకు అంటే ఆగస్టు 9న ‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మథుడు 2’ రిలీజ్ కానుంది. చైతన్ బాణీలు అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి వారం గ్యాప్లో రానున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్తో చైతన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.