నటసింహం నందమూరి బాలకృష్ణని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం `పైసా వసూల్`. అంతేకాదు, ఈ సినిమాతో బాలయ్య గాయకుడిగానూ అవతారమెత్తి అభిమానులను అలరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం… బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినప్పటికీ… రెండేళ్ళ తరువాత బాలయ్య, పూరి మరోసారి జట్టుకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తాజాగా పూరి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో బాలయ్యని అప్రోచ్ అయ్యాడట. కథ నచ్చడంతో బాలయ్య కూడా పూరితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అంతేకాదు… కె.యస్.రవికుమార్, బోయపాటి శ్రీను చిత్రాల తరువాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని టాలీవుడ్ టాక్. త్వరలోనే బాలయ్య, పూరి సెకండ్ వెంచర్పై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే… పూరి కొత్త చిత్రం `ఇస్మార్ట్ శంకర్` ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ డబుల్ దిమాక్ హైదరాబాదీగా నటించిన ఈ సినిమాలతో నిధి అగర్వాల్, నభా నటేష్ నాయికలుగా నటించారు.
[subscribe]
[youtube_video videoid=lH_azWTGozc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: