సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో సందీప్ వంగానే దర్శకుడిగా తెరకెక్కించిన రీమేక్ కబీర్ సింగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడ అర్జున్ రెడ్డికి ఎలాగైతే వివాదాలు తలెత్తాయో.. కబీర్ సింగ్ కు కూడా పలు విమర్శలు తలెత్తాయి. వాటికి తోడు…రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలువురు సెలబ్రిటీలకు ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ సినిమాలో కియారా అద్వానీని షాహిద్ కపూర్ కొట్టే సన్నివేశంపై సందీప్ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి.
సందీప్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక వారి కామెంట్లపై స్పందించిన సందీప్..తాను అన్న మాటలను మీడియా తప్పుగా అర్థంచేసుకుందని అన్నారు.
ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అని వెల్లడించారు. మరి ఈ వ్యవహారం ఇక్కడితోనైనా సద్దుమణుగుతుందో లేదో? చూద్దాం..
[youtube_video videoid=xxPb9zh2_lM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: