`మంగమ్మగారి మనవడు`, `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహా`… ఇలా రీమేక్స్ లోనూ బ్లాక్బస్టర్స్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నటసింహ నందమూరి బాలకృష్ణది. ఇంకా చెప్పాలంటే… ఒరిజినల్ వెర్షన్స్ కంటే మిన్నగా రీమేక్స్ హిట్ అయిన సందర్భాలు బాలయ్యకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో… ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో మరో రీమేక్లో నటించబోతున్నారంటూ టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మూడేళ్ళ క్రితం హిందీనాట అఖండ విజయం సాధించిన కోర్ట్ డ్రామా `పింక్` (అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులు)ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రీమేక్ రైట్స్ను ప్రముఖ నిర్మాత `దిల్` రాజు సొంతం చేసుకున్నారని తెలిసింది. చాన్నాళ్ళుగా బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్న రాజు… ఇప్పుడీ రీమేక్లో సదరు స్టార్ హీరోని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి… ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
అన్నట్టు… `పింక్`ని `నేర్కొండ పార్వై` పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అజిత్, శ్రద్ధా శ్రీనాథ్, విద్యా బాలన్ (గెస్ట్ రోల్) నటించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
[youtube_video videoid=hGap6AtfrEg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: