సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి లేడీ సూపర్స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాశ్మీర్లో తొలి షెడ్యూల్ను చిత్రీకరించే పనిలో ఉంది చిత్ర బృందం. కాగా… మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చిత్ర కథానుసారం కాశ్మీర్ నుంచి ఆంధ్రాకు రైలు ప్రయాణం చేసే మహేష్… ఆ జర్నీలోనే రష్మికతో ప్రేమలో పడతాడట. ఈ నేపథ్యంలో సాగే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని సమాచారం. ఈ ట్రైన్ ఎపిసోడ్లో మహేష్, రష్మికతో పాటు రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, చిత్రానికే హైలైట్గా నిలవనున్న ఈ ట్రైన్ ఎపిసోడ్ రన్ టైమ్ కాస్త ఎక్కువగానే ఉంటుందంట. అంతేకాదు… ఈ సన్నివేశాలను ఒరిజినల్ ట్రైన్లో చిత్రీకరించడం కష్టం కాబట్టి… ఓ స్పెషల్ ట్రైన్ సెట్ను వేసే ప్లాన్లో ఉందట చిత్ర బృందం. ఇందుకోసం హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో ఓ స్పెషల్ ట్రైన్ సెట్ను తీర్చిదిద్ది అక్కడే ఈ ఎపిసోడ్స్ను షూట్ చేయాలని భావిస్తోందట. కాశ్మీర్లో జరిగే తొలి షెడ్యూల్ అనంతరం అంటే ఆగస్టులో ఈ ట్రైన్ ఎపిసోడ్ని పిక్చరైజ్ చేస్తారట. సినిమా ప్రథమార్ధంలో వచ్చే ఈ లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ మేరకు రంజింపజేస్తుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్త నిర్మాణంలో `సరిలేరు నీకెవ్వరు` నిర్మితమవుతుండగా… దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: