సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం… జూలై 5 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇదిలా ఉంటే… ఇంకా రెగ్యులర్ షూట్కి కూడా వెళ్ళని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి ప్రసార హక్కుల్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని జెమినీ టీవీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. అంతేకాదు, ఈ శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాలీవుడ్ టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఈ మొత్తం రూ.16.5 కోట్ల వరకు ఉందని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ గత చిత్రం ‘మహర్షి’ శాటిలైట్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడుకాగా… ఇప్పుడు తన అప్కమింగ్ ఫిలిమ్ ‘సరిలేరు…’ రూ.16.5 కోట్లకు అమ్ముడవడం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. ఇక థియేట్రికల్ రైట్స్ పక్కన బెడితే… నాన్ థియేట్రికల్ రైట్స్(డిజిటల్, ఆడియో, హిందీ డబ్బింగ్) రూపంలో ‘సరిలేరు నీకెవ్వరు’కి దాదాపు రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మహేష్, ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడం, చాలా కాలం గ్యాప్ తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇవ్వడం వంటి పలు పాజిటివ్ ఎలిమెంట్స్… ‘సరిలేరు నీకెవ్వరు’పై భారీ స్థాయిలో అంచనాలు పెంచుతున్నాయి. దానికి తగ్గట్టే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు కూడా క్రేజీగా సాగుతున్నాయని టాక్.
కాగా… అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
[youtube_video videoid=TkA7tJ_hWSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: