ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ కల్కీతో రాజశేఖర్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గతంలో న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సస్పెన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ‘ఆకాశవాణి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. నాజర్ పలికిన డైలాగ్ ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అన్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
కాగా ఈ సినిమాలో రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ, నందిత శ్వేత నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, దాశరథి శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈచిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=LxveqQ4eipc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: