నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో `జై సింహా` తరువాత మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య సరసన శ్రియ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఆ మధ్య పలు కథనాలు వచ్చాయి. అలాగే బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లుగానూ వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ రెండు విషయాలపై ఓ ఆంగ్ల పత్రికకు క్లారిటీ ఇచ్చాడు. ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని ఆయన తెలిపాడు. అదేవిధంగా ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉండవని, ఏ ఒక్కరిని టార్గెట్ చేసుకుని ఈ సినిమాని తీయడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.
కాగా, నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు? అన్నదే ఈ సినిమా కథని… బాలయ్య పోలీస్ ఆఫీసర్గానూ, గ్యాంగ్ స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని ఇన్సైడర్స్ టాక్.
చిరంతన్ భట్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
[youtube_video videoid=jUxnrFUYzBA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: