గత ఏడాది ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్.’ చిత్రాలలో కథానాయికగా నటించి అలరించింది అదితిరావ్ హైదరి. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నాయికగా నటిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. అంతేకాదు… మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి కూడా అదితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా… ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మరో ప్రేమకథను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసమే… అదితిని నాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. వయసులో తనకంటే పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి కథగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉండబోతోందని వినికిడి. మరి రెండు దశాబ్దాల కిందట వినీత్, సౌందర్య జంటగా వచ్చిన ‘ఆరోప్రాణం’, అటుఇటుగా పదేళ్ళ క్రితం వచ్చిన `ఏమాయ చేశావె` (నాగచైతన్య, సమంత) తరహా స్టోరీ లైన్తో రానున్న ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కె.కె.రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది.
కాగా… రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=gALbWAqN1uE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: