నార్త్ ఆడియన్స్ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. దానికీ కారణం ఏంటంటారా..? కబీర్ సింగ్. కబీర్ సింగ్ రీమేక్ చేయడానికి.. నార్త్ ఇండియన్ ఆడియన్స్ మహేష్ కు థ్యాంక్స్ చెప్పడానికి లింక్ ఏముందనుకుంటున్నారా..? అసలు మ్యాటరేంటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినిపాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే కదా. ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజే మారిపోయింది. నిజానికి ఈ సినిమా తరువాత సందీప్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే మహేష్ ఆ తరువాత పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కొద్ది నెలలు వెయిట్ చేయమని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పడింది.
ఇక ఈలోపు తెలుగు అర్జున్ రెడ్డి క్రేజ్ చూసిన షాహిద్ కపూర్.. సందీప్ రెడ్డే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే రీమేక్ చేస్తానని చెప్పడంతో ఈ గ్యాప్ లో తాను కూడా ఈ సినిమా రీమేక్ తీయడానికి ఒప్పుకున్నాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో ఈసినిమాను రీమేక్ చేస్తున్నాడు సందీప్. షాహిద్ కపూర్ సరసన కియారా అద్వాని నటిస్తుంది. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మహేష్ కు నార్త్ ఆడియన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. ఒకవేళ సందీప్ తో సినిమా చేయడానికి అప్పుడే ఒప్పుకున్నట్టైతే.. ఇప్పుడు ‘కబీర్ సింగ్’ సినిమా వచ్చుండేది కాదని.. ‘కబీర్ సింగ్’ క్రెడిట్ మహేష్ బాబుదే అని సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతున్నారు. మరి నిజంగానే సందీప్ తో మహేష్ సినిమా చేసి ఉంటే ‘కబీర్ సింగ్’ సినిమా రాకపోయేది ఏమో… మరి ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ సినిమా అంత సూపర్ హిట్ అవుతుందో..? లేదో..? తెలియాలంటే మాత్రం రెండు రోజులు ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid= B9_AnB9WRZw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: