యూవీ క్రియేషన్స్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు వంశీ, ప్రమోద్ స్థాపించిన ఈ సంస్థ… అనతికాలంలోనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రభాస్ నటించిన ‘మిర్చి’(2013)తో ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థ జైత్రయాత్ర… ‘రన్ రాజా రన్’(2014), ‘భలే భలే మగాడివోయ్’(2015), ‘ఎక్స్ప్రెస్ రాజా’(2016), ‘మహానుభావుడు’(2017), ‘భాగమతి’(2018) వరకు కొనసాగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ప్రస్తుతం ఈ సంస్థ తమ తొలి చిత్ర కథానాయకుడు ప్రభాస్తో ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో యువ దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్… ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.
ఇంతవరకు ప్రతీ ఏటా ఒక విజయాన్ని అందుకుంటూ వస్తున్న యూవీ క్రియేషన్స్… తారాస్థాయిలో అంచనాలున్న‘సాహో’తో మరోసారి ఆ విజయపరంపరను కొనసాగిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=d6Kt489jbFc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: