టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాతో ఏకంగా తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ మలయాళంలో కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలై.. కొంత వరకూ చిత్రీకరణ కూడా జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో విజయ్ దేవరకొండ కార్మిక నాయకుడిగా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో నటించనున్నాడట. కార్మిక నాయకుడి తోపాటు.. ఎన్నారైగా.. మూడో పాత్రలో ఆయన రైటర్ గా కనిపించనున్నాడట. మూడు కథలను ప్రేక్షకులకు చెబుతూ, ఈ మూడు కథల్లోను తనే కథానాయకుడిగా కనిపించడం .. ఈ మూడు కథలకి ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండటం విశేషమని చెబుతున్నారు.
క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్క హీరోయిన్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్ ఇప్పుడు ముగ్గురు భామలతో నటించనున్నాడు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోన్న ఇజబెల్లె హీరోయిన్లుగా నటించనున్నారు.
[youtube_video videoid=lBu5kulzoqg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: