సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా ఏముంది. 60 మిలియన్స్ గా పైగా డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. నెం.1 ట్రెండింగ్ లో నిలిచింది. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది టీజర్ ను చూసి ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రద్దా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్ను ప్రదర్శించారు. టీజర్ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘ప్రభాస్తో, సుజీత్తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాను ఆగష్టు15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: