వరుస సినిమాలతో సందడి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్… ప్రస్తుతం `దర్బార్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఏప్రిల్లో ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్… మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం చెన్నైలో వేసిన రైల్వే స్టేషన్లో రజనీకాంత్, నివేదా థామస్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం… ఆగస్టు వరకు `దర్బార్` షూటింగ్ జరుగుతుందని తెలిసింది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహించి… సంక్రాంతి సీజన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[youtube_video videoid=sdz1hyQXEo8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: