వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శర్వానంద్. ప్రస్తుతం `రణరంగం`, `96` రీమేక్లతో బిజీగా ఉన్నాడీ యంగ్ హీరో. కాగా… `రణరంగం` ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతుండగా, `96` రీమేక్ ఏడాది చివరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే… `96` చిత్రీకరణ దశలో ఉండగానే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కు ఓకే చెప్పాడట శర్వా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నృత్య దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అలరించిన రాజు సుందరం… పదకొండేళ్ళ క్రితం అజిత్, నయనతార, నవదీప్ కాంబినేషన్లో ‘ఏగన్’(2008) అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించాడు. కట్ చేస్తే… మళ్ళీ ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టడానికి సిద్దపడుతున్నాడట ఈ ఏస్ కొరియోగ్రాఫర్. ఈ నేపథ్యంలోనే… ఈ సారి శర్వానంద్తో తన కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు కూడా పూర్తయ్యాయట.
కాగా, ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని… ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నట్టు టాక్. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
[youtube_video videoid=IrfmK-Tmmto]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: