సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సాహో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. చాలా వరకూ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోగా.. పాటలు పెండింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో ఓ సాంగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ టీమ్.. ఇప్పుడు మరో పాటను చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే ఈ పాట కోసం సాహో టీమ్ ఆస్ట్రియాకు వెళ్లనుంది. అక్కడ ప్రభాస్, శ్రద్ధా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారట. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, ఎవలిన్ శర్మ,అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ప్రభాస్ రీచ్ అవుతాడో?లేదో? చూద్దాం..
[youtube_video videoid=Z6WlMvYEc3Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: