దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెరుపువేగంతో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో… తారక్, చెర్రీ వేర్వేరు సందర్భాల్లో గాయపడటంతో షూటింగ్కు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గాయం నుంచి కోలుకోవడంతో ఇటీవలే తాజా షెడ్యూల్ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో భాగంగానే… హైదరాబాద్ నగర శివార్లలో వేసిన సెట్లో కొమరం భీమ్(తారక్), అల్లూరి సీతారామరాజు(చరణ్) బ్రిటిషర్స్ను ఎదిరించే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్లో కథానాయిక అలియా భట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.
నిత్య మీనన్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్ ఆర్ ఆర్
కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని… 2020, జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=-4zAhT8bHJ4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: