గత ఏడాది విడుదలైన ఆర్ ఎక్స్100
తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో బోల్డ్గా నటించి కుర్రకారు మనసును దోచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… స్వల్ప విరామం అనంతరం వరుసగా నాలుగు ప్రాజెక్ట్లను అంగీకరించింది. అంతేకాదు… ఇవన్నీ కూడా నటిగా తనకు సవాల్ విసిరే పాత్రలేనట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఫీమేల్-సెంట్రిక్ మూవీగా రూపొందిన ‘ఆర్ డి ఎక్స్ లవ్’లో ప్రధాన పాత్రలో నటించింది పాయల్. భాను శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం… జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా అభినయానికి అవకాశమున్న పాత్రలో కనిపించనుంది పాయల్. ఈ సినిమాతో పాటు… వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’లో వెంకీ సరసన కథానాయికగా నటిస్తోందీ అమ్మడు. ఇందులోనూ తనది డిఫరెంట్ రోల్ అని టాక్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.
అలాగే… మాస్ మహారాజ్ రవితేజకు జంటగా ‘డిస్కో రాజా’లో నటిస్తోంది పాయల్. ఇందులో మూగ, చెవిటి అమ్మాయిగా ఓ ఛాలెంజింగ్ రోల్ను చేస్తోంది ఈ పంజాబీ భామ. వచ్చే నెల నుండి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనుంది పాయల్. మరోవైపు… గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా తెరకెక్కుతున్న సినిమాలోనూ ఓ కీలకపాత్రలో మెరవనుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించనుందట పాయల్. త్వరలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
మొత్తమ్మీద… వైవిధ్యమైన పాత్రలకే ఓటేస్తూ ముందుకు సాగుతున్న పాయల్… ఈ నాలుగు చిత్రాలతో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
[youtube_video videoid=KIIrIY7G6j4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: