లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇద్దరు’(1997) సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది అందాల తార ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘గురు’, ‘రావణ్’ (తెలుగులో విలన్
) చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్యా రాయ్ స్వయంగా ధ్రువీకరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవాలాధారంగా మణిరత్నం ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో… కేన్స్ చిత్రోత్సవాల్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… తాను మణిరత్నం సినిమాలో నటిస్తున్నానని, మణి సార్తో కలిసి పనిచేయడం ఎప్పుడూ థ్రిల్లింగ్గా, సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ మాజీ ప్రపంచ సుందరి.
ఇదిలా ఉంటే… చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు భార్యగా ఐశ్వర్యా రాయ్… నందిని అనే పాత్రలో దర్శనమివ్వనున్నట్టు సమాచారం. రాజ్యాధికారం మీద మక్కువతో ఎటువంటి ద్రోహానికైనా పాల్పడే నెగటివ్ రోల్లో ఐష్ నటించనుందట. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.మరి… మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్ జోడీ ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=RjSeTHHQO1U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: