సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు కేవలం దక్షిణాది ప్రేక్షకులనే కాకుండా… నార్త్ ఆడియన్స్నూ అలరిస్తూ ఉంటాయి. అందుకే ఈ మధ్య ఆయన నటించిన సినిమాల్లో బాలీవుడ్ నటులకూ అవకాశం కల్పిస్తున్నారు. రజినీ నటించిన గత మూడు చిత్రాల(‘కాలా’లో నానా పాటేకర్, ‘2.ఓ’లో అక్షయ్ కుమార్, ‘పేట’లో నవాజుద్దిన్ సిద్దికి)ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు ఈ మూడు సినిమాలలో నటించిన బాలీవుడ్ నటులు ప్రతినాయక పాత్రల్లో కనిపించడం విశేషం. కాగా… ప్రస్తుతం రజినీ, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కలయికలో రూపొందుతున్న ‘దర్బార్’లో కూడా విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుణ్ణి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… పలు హిందీ సినిమాల్లో హీరోగా మెప్పించి… ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ రాణిస్తున్న సీనియర్ హీరో సునీల్ శెట్టి… ఇప్పుడు రజినీ సినిమాలో స్టైలిష్ విలన్గా దర్శనమివ్వనున్నాడని టాక్. బిజినెస్మ్యాన్గా కనిపిస్తూ… రజినీని ఢీ కొట్టే పాత్రలో ఈ బాలీవుడ్ నటుడు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు జూలై నెలలో జరగబోయే చిత్రీకరణలో సునీల్ శెట్టి పాల్గొంటాడని సమాచారం. కాగా… సునీల్ శెట్టి ఎంట్రీపై క్లారిటీ రావల్సి ఉంది.ఇదిలా ఉంటే… రజినీ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=sdz1hyQXEo8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: