ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలసి నటించడం అరుదైన విషయమనే చెప్పాలి. హిందీనాట కల్ ఆజ్ ఔర్ కల్
(1971) పేరుతో రూపొందిన చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్… ఇలా మూడు తరాల నటులు కలసి నటించి భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే… 43 ఏళ్ళ తరువాత తెలుగునాట కూడా ఈ తరహా చిత్రం రూపొందింది. అదే… ‘మనం’. అయితే… కల్ ఆజ్ ఔర్ కల్
తరహాలో తాత, తండ్రి, మనవడు కథలా కాకుండా ఓ వినూత్న కోణంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇంకా చెప్పాలంటే… నిజ జీవితంలోని తండ్రీ కొడుకులు వెండితెరపై రివర్స్ వెర్షన్లో కనిపించడం మనం
ప్రత్యేకత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్కినేని మూడు తరాల కథానాయకులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో… శ్రియాశరన్, సమంత కథానాయికలుగా అలరించారు. శరణ్య, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించగా… అమల అక్కినేని, అఖిల్ అక్కినేని, అమితాబ్ బచ్చన్, లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా, నీతూ చంద్ర అతిథి పాత్రల్లో మెరిసారు. విక్రమ్ కె.కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని అందంగా తీర్చిదిద్దారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన “కనిపెంచిన మా అమ్మకే”, “కనులను తాకే”, “చిన్ని చిన్ని ఆశలు” పాటలు మెలోడీ ప్రియులను మురిపించాయి. అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ‘మనం’ చిత్రం… 2014 మే 23న విడుదలై… నేటితో ఐదేళ్ళను పూర్తి చేసుకుంది.
[subscribe]
[youtube_video videoid=wSPFRgCkCOM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: