టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలుగొందుతోంది అక్కినేని సమంత. గత ఏడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’, ‘యూ టర్న్’ వంటి చిత్రాలతో నటిగా మంచి విజయాలను అందుకుంది. ఈ ఏడాది ‘మజిలీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ చెన్నై బ్యూటీ. ఇందులోని శ్రావణి పాత్రలో ఒదిగిపోయి… విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సామ్ ప్రధాన పాత్రధారిణిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ చిత్రం తెరకెక్కిన విషయం విదితమే. కొరియన్ మూవీకి రీమేక్గా రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో నాగశౌర్య హీరోగా నటించగా… సీనియర్ నటీమణి లక్ష్మి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను జూన్ ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన రానుంది.
[subscribe]
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: